సురేందర్ రెడ్డి

Wednesday,November 23,2016 - 01:13 by Z_CLU

సురేందర్ రెడ్డి ప్రముఖ దర్శకుడు. డిసెంబర్ 7 , 1975 లో జమ్మికుంట, కరీంనగర్ లో జన్మించారు. కళ్యాణ్ రామ్ నటించి, నిర్మించిన ‘అతనొక్కడే’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తో పాటు విజయం అందుకున్నారు. ఈ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ కేటగిరి లో నంది అవార్డు అందుకున్నారు . ఈ చిత్రం తారువాత ఎన్.టి.ఆర్ తో ‘అశోక్’, మహేష్ బాబు తో ‘అతిధి’ సినిమాలను తెరకెక్కించారు. రవి తేజ హీరోగా తెరకెక్కిన ‘కిక్’ సినిమాతో దర్శకుడిగా మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత ఎన్.టిఆర్ తో మరో సారి ‘ఊసరవెల్లి’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ హీరో గా ‘రేసు గుర్రం’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం తో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ కేటగిరి లో సైమా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కథానాయకుడిగా తమిళ చిత్రం తని ఒరువన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ‘ధృవ’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు..

సంబంధిత వార్తలు