రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఉంగరాల రాంబాబు'

Sunday,September 03,2017 - 11:06 by Z_CLU

సునీల్, మియా జార్జ్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో హిల్లేరియాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘ఉంగరాల రాంబాబు’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.. ఇటీవలే ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 15 న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో ఇమోషనల్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయని, సునీల్ కరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ హిట్ గా నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు పరుచూరి కిరీటి నిర్మాత.