యాక్షన్ థ్రిల్లర్ తో రెడీ అవుతున్న సచిన్

Tuesday,May 02,2017 - 04:30 by Z_CLU

సచిన్‌ హీరోగా ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఫేమ్‌ తాతినేని సత్య దర్శకత్వంలో వై కింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థపై రైనా జోషి తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వీడెవడు’. మొన్నటి వరకూ హీరో ఎవరు తెలియకుండా క్యూరియాసిటీ నెలకొల్పి టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది..

సచిన్‌ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఈషా గుప్తా హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రేమించిన అమ్మాయి ని చంపాడనే మిస్టరీ తో సస్పెన్స్‌ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..