ప్రభాస్ మైనపు విగ్రహం

Tuesday,May 02,2017 - 04:04 by Z_CLU

ఓ వైపు మోస్ట్ అవేటెడ్ మూవీ బాహుబలి 2 ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో బిగ్గెస్ట్ న్యూస్. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన అతి కొద్ది మందికి మాత్రమే చోటు దక్కే టుస్సాడ్స్ మ్యూజియంలో రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా ప్లేస్ దక్కింది. ఈ విషయం చాలా కాలం క్రితమే అనౌన్స్ అయినా, ఈ విగ్రహాన్ని లేటెస్ట్ గా ఆవిష్కరించారు మ్యూజియం అధికారులు.

భారత ప్రధాన మంత్రి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన తరవాత ఇమ్మీడియట్ గా టుస్సాడ్ మ్యూజియంలో చోటు చేసుకున్న ఫేమస్ ఇండియన్ పర్సనాలిటీ ప్రభాస్ దే కావడం, అందునా ముఖ్యంగా టాలీవుడ్ నుండి ఈ మ్యూజియంలో చోటు దక్కించుకున్న మొట్ట మొదటి తెలుగు నటుడు కూడా ప్రభాసే కావడం విశేషం. కాకపోతే ప్రధాని మైనపు విగ్రహాన్ని లండన్ లో ఏర్పాటుచేస్తే, ప్రభాస్ మైనపు బొమ్మను బ్యాంకాక్ లో తెరిచిన కొత్త బ్రాంచ్ లో ఏర్పాటుచేశారు

ఓ వైపు బాహుబలి రికార్డ్స్ పై రికార్డ్స్ బ్రేక్ చేయడం, దానికి తోడు ప్రభాస్ కి ఇంతటి అరుదైన గౌరవం దక్కడంతో ప్రభాస్ ఐదేళ్ల డెడికేషన్ కి తగ్గ ప్రతిఫలం దొరికిందని ఫీల్ అవుతున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్.