ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న మన్మధుడు-2

Thursday,April 04,2019 - 03:02 by Z_CLU

నాగార్జున, రకుల్ ప్రీత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మన్మధుడు-2 సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫ్యామిలీ ఎపిసోడ్ సీన్స్ పిక్చరైజ్ చేశారు. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్లతో పాటు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.

నిజానికి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పోర్చుగల్ లో ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ పెట్టుకున్నారు. త్వరలోనే పోర్చుగల్ లో సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

మనం ఎంటర్ ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు చైతన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. వెన్నెల కిషోర్, రావురమేష్, నాజర్, ఝాన్సీ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.