తదుపరి సినిమాకు సిద్దమవుతున్న కొరటాల

Saturday,August 27,2016 - 05:26 by Z_CLU

 

‘మిర్చి’ తో రచయిత నుండి దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే దర్శకుడిగా తానేంటో నిరూపించుకొని సూపర్ హిట్ అందుకొని రెండో చిత్రం గా ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కొరటాల శివ త్వరలోనే మూడో చిత్రం ‘జనతా గ్యారేజ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 1 న  విడుదల కానుంది. ఈ సినిమా తరువాత కొరటాల మరో సారి మహేష్ తో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. డి.వి.వి సినిమాస్ బ్యానర్ పై డ్.వి.వి దానయ్య నిర్మించనున్న ఈ సినిమా కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు శివ. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ‘జనతా గ్యారేజ్’ విడుదల పైనే పెట్టిన కొరటాల ఈ సినిమా విడుదల తరువాత పూర్తి స్క్రిప్ట్ వర్క్ లో బిజీ కానున్నాడని సమాచారం. జనవరి లో ఈ సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.