NTR hosts a party for few celebs from the film industry at his house
ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు వచ్చినందుకు జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేస్తూ తన నివాసంలో ఓ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసి వేడుక జరుపుకున్నాడు. ఈ పార్టీలో ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, శిరీష్, నవీన్ యెర్నేని, వై రవిశంకర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
“స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో ఒక సాయంత్రం బాగా గడిపాను. జేమ్స్ మరియు ఎమిలీలను కలుసుకోవడం బాగుంది. మీ మాటను నిలబెట్టుకుని, డిన్నర్ కి విచ్చేసినందుకు ధన్యవాదాలు” అని ట్వీట్ చేసి డిన్నర్కి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం భారీ స్థాయిలో పాన్-ఇండియా మూవీగా రూపొందుతోంది. వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రాబోతుంది.