ఫ్రైడే రిలీజ్
Thursday,January 05,2017 - 12:10 by Z_CLU
ప్రతీ శుక్రవారం కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయి టాలీవుడ్ లో సందడి చేస్తుంటాయి. అయితే ఈ న్యూ ఇయర్ వీకెండ్ లో కూడా ఓ నాలుగు సినిమాలు థియేటర్స్ లో కి రాబోతున్నాయి. ఆ సినిమాల పై ఓ లుక్కేద్దాం.
ఈ వీకెండ్ నూతన నటీనటులతో డాక్టర్ మళ్ల విజయ్ ప్రసాద్ నిర్మించిన ‘ఇంకేంటి నువ్వే చెప్పు’ అనే సినిమా రిలీజ్ కానుంది. సన్ని, ప్రశాంత్ లు హీరోలుగా అక్షిత,ప్రసన్న హీరోయిన్స్ గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపటి నుంచి యూత్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది.
అప్పట్లో విజయ శాంతి నటించిన ‘పడమటి రాగం ‘ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అలాంటి కధాంశం తో గణేష్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం “పడమటి సంధ్యారాగం లండన్ లో’ చైతు శాంతారాం’ షాహెలా రాణి, లండన్ గణేష్ ,మీరాబెల్ స్టువర్ట్ లతో దర్శకుడు వంశీ మునిగంటి కామెడీ డ్రామా గా తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అయింది.
మనోజ్ నందం, స్మితికాచార్య ని జంటగా బాల.జి దర్శకత్వంలో ఆర్.యస్.క్రియోషన్స్ అండ్ శ్రీ శివపార్వతి కంబైన్స్ బ్యానర్ లో తన్నీరు సింహద్రి, సిందిరి గిరి సంయుక్తంగా తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఏ రోజైతే చూశానో’.. ఇటీవలే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జనవరి 6న రిలీజ్ కానుంది.
ఈ మూడు సినిమాలతో పాటు మరో హాలీవుడ్ డబ్బింగ్ సినిమా కూడా ఇక ఈ వీకెండ్ థియేటర్స్ లో సందడి చేయబోతుంది. మార్టేన్ టైయిడమ్ దర్శకత్వంలో క్రిష్ ప్రాట్, జెన్నీఫర్ లారెన్స్ నటించిన ‘ప్యాసెంజర్స్’ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ ఈ సినిమా జనవరి 6న వరల్డ్ వైడ్ గా తెలుగు,తమిళం,హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ అవుతుంది.