Monday,August 08,2016 - 03:13 by Z_CLU
దర్శకుడు క్రిష్ ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం రాత్రి 9 గంటలకు రమ్య మెడలో మూడు ముళ్లు వేశాడు. గోల్కొండ రిసార్ట్ లో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్, గోపీచంద్, కార్తి, రకుల్ ప్రీత్ సింగ్, రాజమౌళి, ప్రగ్యా జైశ్వాల్, మంచు లక్ష్మి, అల్లు అరవింద్, దిల్ రాజు, స్రవంతి రవికిషోర్, వైవీఎస్ చౌదరి, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ వివాహానికి హాజరై.. వధూవరుల్ని ఆశీర్వదించారు. ప్రస్తుతం బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్రశాతకర్ణికి దర్శకత్వం వహిస్తున్నాడు క్రిష్. ఈ పెళ్లి కోసమే సినిమా షూటింగ్ ను కొన్ని రోజుల పాటు నిలిపివేశారు. ఆగస్ట్ 22 నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి కొత్త షెడ్యూల్ ప్రారంభమౌతుంది.
Wednesday,September 20,2023 01:19 by Z_CLU
Tuesday,September 27,2022 06:18 by Z_CLU
Monday,September 19,2022 11:44 by Z_CLU
Monday,August 01,2022 04:33 by Z_CLU