మెగా మల్టీ స్టారర్
Monday,May 29,2017 - 03:47 by Z_CLU
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలనివుంది అని ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ భారీ మల్టీ స్టారర్ మూవీని కళా బంధు టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ భారీ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారన్న విషయం విదితమే.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించినకథను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల చిత్రం షూటింగ్ సమయం లో డా. టి. సుబ్బరామిరెడ్డి వీరిద్దరినీ కలవటం జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కద ను సిద్ధం చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,సుబ్బరామిరెడ్డిలకు చెప్పటం జరిగింది.