NTR అరవిందసమేత నుండి ‘ఏడపోయాడో’ లిరికల్ వీడియో

Tuesday,September 25,2018 - 05:59 by Z_CLU

NTR అరవింద సమేత’ నుండి ‘ఏడ పోయాడో’ లిరికల్ వీడియో రిలీజయింది. సినిమాలోని మోస్ట్ ఇంటెన్సివ్ సాంగ్ ‘పెనివిటి’ తరవాత మళ్ళీ అంతే డెప్త్ తో లిరిక్స్ రాసిన సాంగ్ ఇది. సినిమాలో సందర్భానుసారంగా ఉండబోయే ఈ సాంగ్, సినిమాలోని కీ రోల్ చనిపోయిన సందర్భంలో ఉండబోతుందని పెంచల్ దాస్ మాటల్ని బట్టి అర్థమవుతుంది.

‘కత్తిమీద సామే నడకనుకుంటే పాడె పడకవుతుంది. ఆ పడకపై పడుకున్నవారి కుటుంబ సభ్యుల కడుపు కోత ఎలా ఉంటుందనేదే ఈ పాట.’ ఈ మాట ఎవరో కాదు, ఈ రోజు రిలీజ్ అయిన ఈ లిరికల్ వీడియోలో ఈ పాటను రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది.  ఆయనతో పాటు పెంచల్ దాస్ కూడా ఈ పాటను రాయడం విశేషం.

ఈ పాట గురించి డిస్కస్ చేయాల్సి వస్తే లిరిక్స్ తరవాత ఇమ్మీడియట్ గా మాట్లాడుకోవాల్సింది సింగర్స్ నిఖిత శ్రీవల్లి, కైలాష్ ఖేర్, పెంచల్ దాస్ గురించే. లిరిక్స్ కి మరింత లైఫ్ ని ఆడ్ చేశారు ఈ ముగ్గురు.  ఈ సాంగ్ ఇంపాక్ట్ ఆడియో కన్నా, విజువల్స్ లో మరింత ఎలివేట్ అవ్వడం గ్యారంటీ అనిపిస్తుంది.

తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజవుతుంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.