'చిత్రలహరి' లో మరో హీరోయిన్ ఫిక్స్

Sunday,November 04,2018 - 12:50 by Z_CLU

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘చిత్ర లహరి’ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే… త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన కళ్యాణి ప్రిదర్శిని హీరోయిన్ గా నటించనుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో కళ్యాణి తో పాటు మరో హీరోయిన్ తో కూడా రొమాన్స్ చేయబోతున్నాడు తేజ్…

సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో నివేత పెతురాజ్ నటించనుందని తెలుస్తుంది. ఇటివలే ఈ రోల్ కోసం ఆడిషన్ నిర్వహించిన మేకర్స్ నివేతని ఫైనల్ చేసారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవి, మోహన్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.