అంచనాలు పెంచేస్తున్న రానా

Sunday,June 25,2017 - 12:08 by Z_CLU

‘బాహుబలి’, ‘ఘాజీ’ వంటి సినిమాల తర్వాత రానా దగ్గుబాటి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నేనే రాజు నేను మంత్రి’. తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు మేకర్స్.

ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో సినిమా పై మోస్తరు అంచనాలు నేలకొల్పిన రానా లేటెస్ట్ గా  ట్రైలర్ తో అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్లాడు. ముఖ్యంగా పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ తో రిలీజ్ అయినా కొన్ని గంటల్లోనే 3 మిలియన్ వ్యూస్ తో తేజ ఈజ్ బ్యాక్ అనే టాగ్ లైన్ తో ఎట్రాక్ట్ చేస్తూ భారీ హైప్ క్రియేట్  చేస్తుంది ట్రైలర్..

కాజల్ గ్లామర్, పవర్ ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, తేజ స్క్రీన్ ప్లే అన్ని కలగలిపి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 11న తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.