Tuesday,March 10,2020 - 12:13 by Z_CLU
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ప్రభాస్ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటిస్తోంది. ఆమె పాత్ర సినిమాకు హైలెట్ గా ఉంటుందని అంటోంది యూనిట్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు రాథేశ్యామ్ లేదా ఓ డియర్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.