RadheShyam ప్లాన్ అదేనా?

Friday,August 21,2020 - 12:27 by Z_CLU

కారోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ఆగిపోయిన భారీ ప్రాజెక్టుల్లో ప్రభాస్ ‘RadheShyam’ ఒకటి. షూటింగ్ కోసం యూరప్ వెళ్ళిన టీం అక్కడ కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉండటంతో కొన్ని రోజులకే ఇండియాకి రిటర్న్ అయ్యారు. అప్పటి నుండి సినిమా షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఈ ఏడాది లోపే షూటింగ్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్నీ నిర్మాత కృష్ణంరాజు స్వయంగా తెలిపారు.

నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లోపే థియేటర్స్ లోకి వచ్చేది. కానీ లాక్ డౌన్ కారణంగా ప్లాన్ మారింది. మరి ఇప్పుడు యూనిట్ ప్లాన్ చేసినట్టు సినిమా ఏడాది లోపే షూటింగ్ పూర్తవుతుందా ? అనుకున్న టైంకి థియేటర్స్ లోకి వస్తుందా చూడాలి. GopiKrishna Movies ప్రెజెంట్స్ తో UV Creations నిర్మిస్తున్న ఈ సినిమాలో Prabhas సరసన Pooja Hegde హీరోయిన్ గా నటిస్తుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు.