ప్రభాస్ ప్లాన్ అదే ...

Sunday,May 07,2017 - 11:00 by Z_CLU

ప్రస్తుతం బాహుబలి తో థియేటర్స్ లో భారీ హంగామా చేస్తూ భారీ వసూళ్లు సాధిస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమాల పై ఫోకస్ పెట్టేశాడు.. లేటెస్ట్ గా తన నెక్స్ట్ సినిమా ‘సాహో’ టీజర్ తో ఎట్రాక్ట్ చేసి సినిమా పై భారీ అంచనాలను నెలకొల్పిన ప్రభాస్ ఈ సినిమాతో ఆ అంచనాలను అందుకునేందుకునేందుకు గట్టి జాగ్రత్తలే తీసుకుంటూ ముందడుగేస్తున్నాడు.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమా ఎలా ఉండబోతుందా.. అనే డౌట్స్ కి జస్ట్ ఒకే ఒక్క టీజర్ తో సమాధానం ఇచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ఈ సినిమాతో పాటు రాధా కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా పై ఫోకస్ పెట్టేశాడు..

ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ‘సాహో’ తో పాటే రాధా కృష్ణ తో చేయబోయే లవ్ ఎంటర్టైనర్ సినిమాను కూడా ఒకే సారి సెట్స్ పై పెట్టేందుకు రెడీ అవుతున్న ప్రభాస్ ఈ రెండు డిఫరెంట్ జోనర్స్ తో నెక్స్ట్ ఇయర్ థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి భారీ హంగామా చేయబోతున్నాడు.. మొన్నటి వరకూ సాహో సినిమాను ఈ ఇయర్ లోనే రిలీజ్ చేస్తారనే వార్త చక్కర్లు కొట్టగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ ద్వారా ఈ సినిమా ను నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.. సో ‘సాహో’ సినిమాను 2018 స్టార్టింగ్ లో రిలీజ్ చేసి కొన్ని నెలల గ్యాప్ లోనే రాధా కృష్ణ సినిమాను కూడా రిలీజ్ చేసి ఫాన్స్ కి నెక్స్ట్ ఇయర్ డబుల్ ధమాకా అందించాలని భావిస్తున్నాడట ప్రభాస్..