ప్రభాస్ పక్కా ప్లానింగ్

Tuesday,February 19,2019 - 03:33 by Z_CLU

సంవత్సరానికి ఇన్ని సినిమాలు అని రూల్ పెట్టుకోలేదు. ఈసారి లేటయింది ఇకపై ఇంత గ్యాప్ ఉండదు అని  ఎక్కడా మెన్షన్ చేయలేదు. ప్రభాస్ మైండ్ లో ఉన్నదల్లా ఫ్యాన్స్ లో క్రియేట్ అయిన అంచనాలను అందుకోవడమే. అందుకే ‘సాహో’ సినిమాకి ఏ మాత్రం ఆలోచన లేకుండా ఎక్కువ సమయం కేటాయించేశాడు ప్రభాస్.

బాహుబలికి ముందు ప్రభాస్ ఈ స్థాయిలో ప్లానింగ్ చేయలేదా…? అంటే… లేదు అని అంత ఈజీగా కొట్టేయలేం కానీ, బాహుబలి 2 తర్వాత తన చుట్టూ క్రియేట్ అయిన అంచనాలను అందుకోవడానికి, గతంలో కన్నా ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు ప్రభాస్. అందుకే ‘సాహో’ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక కానీ, రాధాకృష్ణ దర్శకత్వంలో చేసే సినిమాపై దృష్టి పెట్టలేదు.

అయితే రియల్ టైమ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో తెరకెక్కుతున్న ‘సాహో’ షూటింగ్ కి ఎంత టైమ్ పడుతుందో, విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా అంతే టైమ్ పడుతుంది. అందుకే ఏ మాత్రం హడావిడి లేకుండా ఏకంగా ఆగష్టు 15 రిలీజ్ అని డేట్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. గ్రాండ్ కాన్వాస్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా, ‘బాహుబలి 2’ సెట్ చేసిన అంచనాలని ఆల్మోస్ట్ రీచ్ అవుతుందనే వైబ్స్ ఓవరాల్ గా కనిపిస్తున్నాయి.

అప్పుడెప్పుడో దుబాయ్ షెడ్యూల్ టైమ్ లో మీడియా ముందుకు వచ్చిన ప్రభాస్, మళ్ళీ సోషల్ మీడియాలో కనిపించింది రాధాకృష్ణ సినిమా విషయంలోనే. ‘సాహో’ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ సినిమాని కూడా స్టార్ చేసేసిన ప్రభాస్, ఈ సినిమా విషయంలోనూ అదే స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ‘సాహో’ లో శ్రద్ధా కపూర్ తో పాటు, మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ ని ప్రిఫర్ చేసిన ప్రభాస్, రాధాకృష్ణ  సినిమాలోను అదే రకం ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

పూజా హెగ్డే బాలీవుడ్ కి కొత్తేం కాదు. పూజా తో పాటు ఈ సినిమాలోని కీ ఎలిమెంట్స్ లో మ్యాగ్జిమం బాలీవుడ్ స్థాయి యాక్టర్స్ నటించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ప్రాసెస్ లో ఉన్న మేకర్స్, పక్కా ప్లానింగ్ ప్రకారం సినిమా పనుల్ని కానిస్తున్నారు.