ఇతడి వయసు 324 సంవత్సరాలు

Saturday,April 22,2017 - 11:08 by Z_CLU

తన అల్టిమేట్ యాక్టింగ్ టాలెంట్ తో ఇప్పటికే నేషనల్ అవార్డు అందుకున్న నటుడు రాజ్ కుమార్ రావు ఇప్పుడు మరో ప్రయోగంతో మనముందుకు రాబోతున్నాడు. విమర్శకులు మెచ్చే ఎన్నో పాత్రలతో వెండితెరపై మెరిసిన ఈ నటుడు త్వరలోనే 324 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఊహించుకోవడానికే కష్టంగా ఉన్న ఈ పాత్రకు “రాబ్తా” సినిమాలో ప్రాణం పోశారు.

ఈ మధ్యే రాబ్తా సినిమా ట్రయిలర్ లాంచ్ అయింది. సుశాంత్ సింగ్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. అయితే ఈ ట్రయిలర్ లో లాస్ట్ లో పండు ముసలి గెటప్ లో వచ్చిన ఓ వ్యక్తి మాత్రం పజిల్ గా మిగిలిపోయాడు. అది ఎవరనేది అప్పుడు  చెప్పలేదు. తాజాగా ఆ ముసలి వ్యక్తి.. రాజ్ కుమార్ రావు అనే విషయాన్ని బయటపెట్టారు.

 

పీరియాడిక్ డ్రామాగా రాబ్తా సినిమా రాబోతోంది. ఇంకా స్ట్రయిట్ గా చెప్పాలంటే తెలుగులో వచ్చిన మగధీర సినిమాకు రాబ్తాకు చాలా దగ్గర పోలికలున్నాయి. వందల ఏళ్ల కిందట ప్రేమను గెలిపించుకోలేక చనిపోయిన ప్రేమికులు.. ఈ జన్మలో తమ ప్రేమను ఎలా సక్సెస్ చేసుకున్నారనేదే స్టోరీ. తెలుగులో రావు రమేష్ పోషించిన పాత్రనే హిందీలో రాజ్ కుమార్ రావు పోషించి ఉంటారని టాక్. సుశాంత్ సింగ్ ఇంట్రడక్షన్ కూడా మగధీరలో చరణ్ ఎంట్రీకి చాలా క్లోజ్ గా ఉంది.