'జై లవ కుశ' కథ మరే హీరోకి చెప్పలేదు. -బాబీ

Sunday,September 24,2017 - 10:06 by Z_CLU

‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బాబీ లేటెస్ట్ గా ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సినిమా ‘జై లవకుశ’.. ప్రస్తుతం థియేటర్ లో సందడి చేస్తున్న ఈ సినిమా గురించి సెట్స్ పై వెళ్ళకముందు వినిపించిన ఓ వార్త పై లేటెస్ట్ గా స్పందించాడు బాబీ .

పవర్ సినిమాతో దర్శకుడిగా ఛాన్స్ అందించిన రవి తేజ కె బాబీ ముందుగా ‘జై లవకుశ’ సినిమా పాయింట్ చెప్పాడన్నది ఆ వార్త. అయితే ఇటీవలే ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రాం అవుతున్న సందర్భంగా మీడియా ప్రమోషన్ లో పాల్గొన్న బాబీ ఈ వార్త పై క్లారిటీ ఇచ్చేశాడు.

ఈ కథను తారక్ కంటే ముందు రవితేజ కి చెప్పాననే వార్తలో నిజం లేదని.. పవర్ తర్వాత రవి తేజ గారికి కథ వినిపించిన విషయం వాస్తవమే కానీ అది ఈ కథ కాదని..ఆయనకీ మరో కథ చెప్పానని.. ఈ కథను కేవలం ఎన్టిఆర్ కి మాత్రమే చెప్పానని ఈ కథకి ఆయనే పర్ఫెక్ట్ అనిపించిందని చెప్పుకోచాడు బాబీ.. అయితే త్వరలోనే రవితేజ గారితో మరో సినిమా చేస్తానని..కాని అది ఎప్పుడనేది ప్రస్తుతం చెప్పలేనని తెలిపాడు..