చరణ్, ఎన్టీఆర్ సినిమా.. ఓ ఫ్యామిలీ డ్రామా

Sunday,December 10,2017 - 03:10 by Z_CLU

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మల్టీస్టారర్ సినిమాపై రోజుకో గాసిప్ పుట్టుకొస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ప్రస్తుతం తండ్రి విజయేంద్రప్రసాద్ తో కథాచర్చల్లో ఉన్నాడు. మూవీని మాత్రం అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమా ఓ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతోందట. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందట. మొదట ఎన్టీఆర్ పార్ట్ పిక్చరైజ్ చేసిన తర్వాత.. రామ్ చరణ్ తో షూటింగ్ మొదలుపెడతారట. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందట.

ఇంతకుముందే రాజమౌళి చెప్పినట్టు ఇందులో ఎలాంటి గ్రాఫిక్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండవు. ఇదొక కంప్లీట్ కుటుంబకథాచిత్రమని తెలుస్తోంది. డీవీవీ దానయ్య దీనికి నిర్మాత.