ఈ ఏడాది ఫినిషింగ్ టచ్ హీరోలు

Sunday,December 10,2017 - 12:03 by Z_CLU

లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అంటాడు పవన్ కల్యాణ్. అలానే ఈ ఏడాది ఫినిషింగ్ టచ్ ఇస్తూ సినిమా రిలీజ్ చేస్తే అది కూడా ఆనందమే. ప్రతి ఏటా ఫినిషింగ్ టచ్ ఇచ్చే హీరోలుంటారు. మరి 2017కు అలా ముగింపు చెప్పే హీరోలు ఎవరో తెలుసా.. వాళ్లే సునీల్, అల్లుశిరీష్.

అవును.. 2017కు టాలీవుడ్ ను గ్రాండ్ గా గుడ్ బై చెప్పే హీరోలు వీళ్లే. అల్లు శిరీష్, సునీల్ సినిమాలు ఈ ఇయర్ ఎండింగ్ లో విడుదలవుతున్నాయి. సునీల్ నటించిన ‘2 కంట్రీస్’ సినిమాను డిసెంబర్ 29న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కంటే ఒక్క రోజు ముందు, డిసెంబర్ 28న అల్లు శిరీష్ నటించిన ‘ఒక్క క్షణం’ థియేటర్లలోకి రానుంది.

నిజానికి వీళ్లిద్దరితో పాటు నాగశౌర్య కూడా జాయిన్ అవుదామనుకున్నాడు. ఛలో సినిమాతో ఈ నెలాఖరుకు వద్దామనుకున్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఛలో మూవీ విడుదలను వాయిదావేశారు. సో.. ప్రస్తుతానికైతే ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకొచ్చేది అల్లు శిరీష్, సునీల్ సినిమాలు మాత్రమే.