Aadavallu Meeku Johaarlu - రిలీజ్ డేట్ ఫిక్స్

Friday,January 28,2022 - 06:47 by Z_CLU

Aadavallu Meeku Johaarlu to release on February 25th

శర్వానంద్ , రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రస్తుతం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 25న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మంచి ఎమోషన్స్ తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ , ఖుష్బు , ఊర్వసి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

రెడ్ సినిమా తర్వాత కిషోర్ తిరుమల నుండి వస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. శర్వా ,రష్మిక నటిస్తుండటంతో ఈ కాంబో సినిమాపై మోస్తరు అంచనాలు నెలకొంటున్నాయి. ఆడవాళ్ళ గురించి గొప్పగా చెప్పే కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కిషోర్ తిరుమల -దేవి కాంబినేషన్ లో వచ్చిన ‘ఉన్నది ఒకటే జిందగీ ‘ , ‘చిత్రలహరి’ ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళీ ఈ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ఆల్బం కోసం మ్యూజిక్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

త్వరలోనే సాంగ్స్ తో పాటు టీజర్ , ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెంచే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బేనర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 25 నుండి థియేటర్స్ లో సందడి చేయనుంది.