వీకెండ్ రిలీజ్

Wednesday,October 30,2019 - 05:57 by Z_CLU

ఈ వీకెండ్ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆవిరి’ తో పాటు విజయ్ దేవరకొండ నిర్మాణంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘మీకు మాత్రమే చెప్తా’ కూడా థియేటర్స్ లోకి రాబోతుంది.

రవి బాబు దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ‘ఆవిరి’ సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ట్రైలర్ సినిమాపై బజ్ తీసుకొచ్చాయి. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ నటించిన ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం మరో విశేషం. ఇక ప్రతీ సినిమాను ఏదో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ తో తెరకెక్కించే రవిబాబు ఈ సినిమాలో ‘ఆవిరి’ని చూపిస్తూ ఎంటర్టైన్ చేయాలని ట్రై చేసాడు. మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో  మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.

‘ఆవిరి’ తో పాటు దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘మీకు మాత్రమే చెప్తా’ అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమా కూడా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షామీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అనసూయ, అభినవ్ గోమటం ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్ తో ఇప్పటికే అందరినీ ఎట్రాక్ట్ చేసింది. మరోవైపు విజయ్ ప్రొడ్యూస్ చేసిన సినిమా కావడంతో అందరి చూపు సినిమాపై ఉంది.