కొత్త సింగర్స్ ని ఆహ్వానిస్తున్న మెహబూబా టీమ్

Wednesday,December 13,2017 - 06:25 by Z_CLU

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పూరి ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘మెహబూబా’ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. 1971 లో జరిగిన ఇండో పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు పూరి. అయితే సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాతో కొత్త సింగర్స్ ని ఇంట్రడ్యూస్ చేయనుంది మెహబూబా టీమ్.

సింగింగ్ కరియర్ లో తమ ట్యాలెంట్ ని ప్రూఫ్ చేసుకోవాలనుకునే వారు వాయిస్ డెమోని voice@puriconnects.com పంపాల్సిందిగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది పూరి కనెక్ట్ టీమ్. ఆన్ స్క్రీన్ ఇరగదీసే ఎంతో మంది ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేసిన పూరి, ఈ సినిమాతో సింగర్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు.

 

అల్టిమేట్ లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.