15 ఏళ్ళు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న త్రిష

Wednesday,December 13,2017 - 06:58 by Z_CLU

త్రిష… మిస్ చెన్నై బ్యూటీ గా గుర్తింపు పొందిన తరవాత, 2002 లో  సరిగ్గా  ఈ  రోజే ‘మౌనం పెసియాదే’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయింది. జస్ట్ గ్లామర్ రోల్స్ కే ఫిక్స్ కాకుండా తన కరియర్ లో ఎన్నో షేడ్స్ లో నటించి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసిన త్రిష 15 ఏళ్ల సినిమా కరియర్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.

‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయినా, ‘వర్షం’ సినిమాతో అన్ని కేటగిరీల  ఆడియెన్స్ గుండెల్లో సెటిలైపోయింది. ఆ తరవాత అదే వరసలో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, స్టాలిన్, సైనికుడు ఇలా చెప్పుకుంటూ పోతే త్రిష కరియర్ లో మైల్ స్టోన్ సినిమాలెన్నో…

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు లాంటి టాప్ మోస్ట్ స్టార్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న త్రిష, జస్ట్ హీరోయిన్ గానే కాదు, ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా తన సత్తా చాటుతుంది. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పర్టికులర్ ఇమేజ్ ని సాధించిన త్రిష, ఇప్పటికీ అంతే కేరింగ్ గా సినిమాలను ఎంచుకుంటూ, అదే జోష్ తో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది.