సెన్సార్ పూర్తి చేసుకున్న సాక్ష్యం.. 27 న గ్రాండ్ రిలీజ్

Wednesday,July 25,2018 - 11:23 by Z_CLU

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా జులై 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయబోతుంది.. గ్లామర్ డాల్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు.

పంచభూతాలు అనే నేచర్ కాన్సెప్ట్ పై వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, థియేట్రికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.. ఏ.విల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు..

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మీనా తదితరులు నటించారు..

టెక్నీషియన్స్:
దర్శకుడు: శ్రీవాస్
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అభిషేక్ నామా
సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: ఆర్థర్ ఎ విల్సన్
కళ: ఎఎస్ ప్రకాష్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
మాటలు: సాయి మాధవ్ బుర్రా
సాహిత్యం: అనంత శ్రీరామ్
యాక్షన్: పీటర్ హెయిన్
PRO: వంశీశేఖర్