రానా కొత్త సినిమా టీజర్ రెడీ

Monday,June 05,2017 - 02:12 by Z_CLU

‘బాహుబలి’ తర్వాత రానా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్  మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రెజెంట్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకున్న ఈ సినిమా రేపటి నుంచి టీజర్ తో సందడి చేయనుంది. తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను రేపు రిలీజ్ చేస్తామని రానా ప్రకటించాడు.

జోగేంద్ర అనే పవర్ ఫుల్  పొలిటికల్ క్యారెక్టర్ లో రానా నటిస్తున్న ఈ సినిమాలో.. అతడి సరసన కాజల్ హీరోయిన్ గా మెరవనుంది. మరో కీలక పాత్రలో క్యాథరీన్ కనిపించనుంది. అనూప్ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు లక్ష్మిీ  భూపాల్ మాటలు అందిస్తున్నారు. తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.