ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మంచు మనోజ్ సినిమా

Monday,June 05,2017 - 03:00 by Z_CLU

వ్యవస్థకి ఎదురు నిలిచేవాడు యోధుడు, వ్యవస్థని చక్కదిద్దేవాడు నాయకుడు. చరిత్ర పుటల్లో చెప్పని విషయాలతో “ఒక్కడు మిగిలాడు”. అంటూ మంచు మనోజ్ దూసుకొస్తున్నాడు. ఈ హీరో బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షుకుల్లో సినిమా పై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. అందుకే ఒక్కడు మిగిలాడు సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.

ఒకవైపు వ్యవస్థకి విరుద్ధంగా పోరాడే వీరుడిగా, మరోవైపు ప్రస్తుత పరిస్థితుల మధ్య నలుగుతున్న వ్యవస్థను ట్రాక్ పై పెట్టే లీడర్ లా మంచు మనోజ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపించబోతున్నాడు.   అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా  నటిస్తున్న ఈ సినిమాకు అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహిస్తున్నాడు.

రొటీన్ కి భిన్నంగా ఓ కొత్త కథతో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాతో మంచు మనోజ్ ఈ ఏడాది మంచి విజయాన్నందుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.