ట్రయిలర్ లాంచ్ కోసం భారీ ఏర్పాట్లు

Monday,June 05,2017 - 02:09 by Z_CLU

మరికొన్ని గంటల్లో దువ్వాడ జగన్నాథమ్-డీజే ట్రయిలర్ ను లాంచ్ చేయబోతున్నారు. సాయంత్రం 7గంటల 30న నిమిషాలకు విడుదల కానున్న ఈ ట్రయిలర్ కోసం నిర్మాత దిల్ రాజు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాడు. ఇప్పటివరకు తనతో పనిచేసిన దర్శకులందర్నీ ఆహ్వానించి, వాళ్ల చేతుల మీదుగా ట్రయిలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాడు.

సుకుమార్, వినాయక్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వాసు వర్మ, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీవాస్, దశరథ్, వేణు శ్రీరామ్, సతీష్ వేగేశ్న, త్రినాథరావు నక్కిన.. ఇలా దిల్ రాజుతో వర్క్ చేసిన చాలా మంది దర్శకులు ఈ ఈవెంట్ కు ఎటెంట్ కాబోతున్నారు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఫిదా సినిమా చేస్తున్న శేఖర్ కమ్ముల కూడా ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చే ఛాన్స్ ఉంది.

దిల్ రాజుకు ఇది 25వ సినిమా. అందుకే డీజేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఆ క్రేజ్ ను డబుల్ చేసే విధంగా ట్రయిలర్ కట్ చేశారట. ఈనెల 23న దువ్వాడ జగన్నాథమ్ సినిమా థియేటర్లలోకి రానుంది.