2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన రంగస్థలం టీజర్

Wednesday,January 24,2018 - 06:49 by Z_CLU

రిలీజైన 90 నిమిషాల్లోనే 2 మిలియన్ డిజిటల్ వ్యూస్ క్రాస్ చేసింది రంగస్థలం టీజర్. మార్చి 30 న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, రామ్ చరణ్, సుకుమార్ కాంబోకి ఫ్యాన్స్ లో ఏ రేంజ్ క్రేజ్ క్రియేట్ అవుతుందో అర్థమై పోతుంది. చెర్రీ ని కామిక్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేస్తున్న ఈ టీజర్ సినిమాపై నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్ ని క్రియేట్ చేస్తుంది.

టీజర్ లో తనని సౌండ్ ఇంజనీర్ గా ఇంట్రడ్యూస్ చేసుకున్న చెర్రీ, యూత్ కి తెగ నచ్చేస్తున్నాడు. దానికి తోడు DSP బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, 1980 బ్యాక్ డ్రాప్ లో ఇంప్రెస్ చేస్తున్న లొకేషన్స్, టోటల్ గా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రంగస్థలం టీజర్. రామ్ చరణ్ సరసన సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.