ముచ్చటగా మూడో సినిమా ఎనౌన్స్ చేసిన నితిన్

Monday,June 24,2019 - 11:32 by Z_CLU

భీష్మ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. తాజాగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ప్రకటించాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ డీటెయిల్స్ రివీల్ చేశారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు రంగ్ దే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే… ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి ఫేం కీర్తిసురేష్ నటించనుంది. వచ్చే ఏడాది సమ్మర్ కు సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు నిర్మాతలు.

ప్రస్తుతం ఇదే బ్యానర్ పై భీష్మ సినిమా చేస్తున్నాడు నితిన్. అది సెట్స్ పై ఉంటుండగానే ఇలా రంగ్ దే ప్రాజెక్టును ఎనౌన్స్ చేశారు. వరుసగా నితిన్ ప్రకటించిన మూడో సినిమా ఇది. ఇక ఇతడి ఖాతాలో ఉన్నది కృష్ణచైతన్య మూవీ మాత్రం. నితిన్ సొంత బ్యానర్ పై రాబోతున్న ఆ సినిమాను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నాడు.