త్వరలోనే సెట్స్ పైకి...

Thursday,June 01,2017 - 12:02 by Z_CLU

ప్రస్తుతం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య.. మరో సినిమాను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న చైతు, ఈ సినిమా సెట్స్ పై ఉండగానే చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకొని ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ‘ప్రేమమ్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చైతూ-చందు కాంబోలో యాక్షన్ థ్రిల్లర్ గా  రూపొందనున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

చందు మొండేటితో చేయాల్సిన సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేసి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడు నాగచైతన్య.  అక్టోబర్ లో సమంతను పెళ్లాడబోతున్నాడు ఈ అక్కినేని హీరో. అందుకే సినిమాలకు ఓ 3 నెలల పాటు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈలోగా అన్ని కమిట్ మెంట్స్ ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు.