కియరా అద్వానీ కలిసొస్తుందా?

Tuesday,April 30,2019 - 11:03 by Z_CLU

వరసగా ఇద్దరు డైరెక్టర్స్ కియరా అద్వానీ నే ప్రిఫర్ చేశారు. అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ ‘’కబీర్ సింగ్’ కోసం సందీప్ రెడ్డి వంగ, కియరా అద్వానీని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇప్పుడు అదే వరసలో ‘ముని’ బాలీవుడ్ రీమేక్ ‘లక్ష్మీ బాంబ్’ కి కూడా కియార అద్వానీ నే హీరోయిన్. అక్షయ్ కుమార్ సరసన కియరా అద్వానీనే పర్ఫెక్ట్ జోడీ అని ఫిక్సయ్యాడు రాఘవ లారెన్స్. అయితే కియరా అద్వానీ ఈ ఇద్దరు డైరెక్టర్స్ డెబ్యూ సినిమాలకు ఎంతవరకు కలిసొస్తుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే రేంజ్ పెంచుకునే పనిలో ఉంది కియరా అద్వానీ. ఇంపాక్ట్ ఉంటుందంటే చిన్న క్యారెక్టర్ అయినా సంతకం చేస్తుంది. ఈ క్వాలిటీస్ తప్ప ఆమె ఇంకా బాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్టులో చేరలేదు. కాబట్టి ఈ రెండు సినిమాలు కియరాకు ఏ రేంజ్ లో కలిసొస్తాయో చూడాలి. క్లిక్ అయితే అటు ఆ సినిమాలకు, ఇటు కియరాకు ఇద్దరికీ లాభమే.

కియరా అద్వానీ బాలీవుడ్ లో ఇంకా టాప్ స్టార్ రేంజ్ కి రీచ్ అవ్వలేదనే ఒక్క డ్రాబ్యాక్ తప్ప, పెర్ఫామెన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గదు. దానికి తోడు స్టోరీ డిమాండ్ చేయాలే కానీ, బోల్డ్ సీన్స్ కి కూడా నో చెప్పదు. కాబట్టి డైరెక్టర్స్ బెస్ట్ చాయిస్ అనిపించుకునే అవకాశాలు  కనిపిస్తున్నాయి.