లెక్క ప్రకారమైతే కైరా అద్వానీ ఫిక్స్...

Saturday,March 09,2019 - 11:03 by Z_CLU

బన్ని, త్రివిక్రమ్ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫిక్సవ్వలేదు. ఇప్పటిదాకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ, ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ ఫిక్సయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా చెర్రీ సరసన ‘వినయ విధేయ రామ’ లో నటించింది కాబట్టి లెక్క ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ నే ఫస్ట్ చాయిస్ అయ్యే అవకాశాలున్నాయి.

కాజల్ అగర్వాల్ : ‘మగధీర’ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, అదే ఏడాది బన్నితో ‘ఆర్య 2’ లో నటించింది. అయితే ఇదే వరసలో మళ్ళీ చెర్రీ సరసన ‘నాయక్’ లో నటించిన కాజల్ అగర్వాల్, వీరిద్దరి ‘ఎవడు’ సినిమాలో బన్ని సరసన కూడా నటించింది. ఈ సినిమాల తరవాత రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే’ లో కూడా నటించేసి అప్పటికే మెగా కాంపౌండ్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ చేసుకున్న కాజల్ అగర్వాల్ లక్కీగా పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో కూడా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాల తరవాత అన్నీ సినిమాలు ఒకెత్తు, ఈ ఒక్క సినిమా ఒకెత్తు అన్నట్టు మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నం 150’ లౌ హీరోయిన్ గా నటించి మెగా హీరోయిన్ అనిపించుకుంది.

తమన్నా : బన్నితో ‘బద్రినాథ్’ చేసి మెగా హీరోయిన్ అనిపించుకుంది తమన్నా. ఆ తరవాత రామ్ చరణ్ ‘రచ్చ’ , అక్కడి నుండి ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ తో ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ లో కూడా నటించేసిందీ మిల్కీ బ్యూటీ.

సమంతా : తక్కిన హీరోయిన్స్ తో పోలిస్తే సమంతా మెగా కాంపౌండ్ లో ఆక్టివ్ గా ఉన్నది కొంచెం తక్కువే. ఎప్పుడో 2013 లో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ తో మెగా టికెట్ తీసుకుంటే మళ్ళీ 2015 లో బన్నితో ‘S/O సత్యమూర్తి’ సినిమాలో నటించింది. ఆ తరవాత మళ్ళీ మరో 3 ఏళ్ల గ్యాప్ తరవాత చెర్రీ సరసన ‘రంగస్థలం’ లో నటించింది.

రకుల్ ప్రీత్ సింగ్ :   రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్, ఆ తరవాత బన్ని ‘సరైనోడు’ లోను నటించేసింది. ఆ తరవాత మళ్ళీ చెర్రీ తో ‘ధ్రృవ’ లో నటించే అవకాశం దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్, సాయి ధరమ్ తేజ్ తో ‘విన్నర్’ లో కూడా నటించింది.

శృతి హాసన్ : పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఆ తరవాత రామ్ చరణ్ తో ‘ఎవడు’, అదే ఏడాది బన్ని ‘రేసుగుర్రం’ లోను చాన్స్ కొట్టేసింది. ఈ మధ్య సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్నా, పవన్ కళ్యాణ్ తో ‘కాటమరాయుడు’ చేశాకే బ్రేక్ తీసుకుంది.

రీసెంట్ గా బన్ని తో ‘దువ్వాడ జగన్నాథం’ లో నటించిన పూజా హెగ్డే, చెర్రీ ‘వినయ విధేయ రామ’ కి క్వాలిఫై అయింది. అలాగే ఇప్పుడు కైరా అద్వానీ కూడా ఆల్రెడీ చెర్రీ సినిమాలో నటించేసింది కాబట్టి బన్ని సినిమాకి 100% క్వాలిఫై అయినట్టే. మరి ఫిల్మ్ మేకర్స్ మధ్య డిస్కర్షన్స్ ఎలా నడుస్తున్నాయో, ఎవరిని ఫిక్స్ చేసుకోనున్నారో లాంటి డీటేల్స్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.