మళ్ళీ స్పీడ్ పెంచిన రవితేజ

Saturday,June 27,2020 - 02:09 by Z_CLU

రెండేళ్ళ కిందటి వరకు రవితేజ నుండి ఏడాదికి రెండు సినిమాలు పక్కా వచ్చేవి. కానీ ‘అమర్ అక్బర్ అంటోనీ’ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ‘క్రాక్’ తో మళ్ళీ సత్తా చాటాలనుకుంటున్న రవితేజ మళ్ళీ స్పీడు పెంచి వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. అవును… మాస్ మహారాజా చేతిలో ప్రస్తుతం ‘క్రాక్’ సినిమా కాకుండా మరో మూడు సినిమాలున్నాయి.

రవివర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న రవితేజ, త్రినాద్ రావు నక్కిన తో పీపుల్ మీడియా బ్యానర్ లో మరో సినిమా చేయనున్నాడు. వీటితో పాటు లేటెస్ట్ గా మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోశియం’ సినిమాను రానాతో కలిసి చేయబోతున్నాడు.

ఇలా వరుసగా సినిమాలు లైన్లో పెట్టిన రవితేజ ఇకపై ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి ఎంటర్టైన్ చేయాలని భావిస్తున్నాడు.