ఈ నెల్లోనే సెట్స్ పైకి బన్నీ-త్రివిక్రమ్ మూవీ

Tuesday,April 09,2019 - 12:55 by Z_CLU

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడనే విషయం 3 నెలలుగా నలుగుతూనే ఉంది. కానీ అది ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది. అందులో హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ ఎవరు లాంటి విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎట్టకేలకు ఈ డీటెయిల్స్ ను అఫీషియల్ గా ప్రకటించింది హారిక-హాసిని సంస్థ.

బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఈ నెల్లోనే సెట్స్ పైకి రాబోతోంది. 24 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందనే విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన యూనిట్.. తమన్ సంగీతం అందించబోతున్నాడనే మేటర్ ను కూడా రివీల్ చేసింది.

మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఈ సినిమాలో సునీల్ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. హారిక-హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోంది ఈ మూవీ.