త్రివిక్రమ్ కంపల్సరీగా ఫాలో అవుతున్న కామన్ పాయింట్

Friday,November 10,2017 - 10:44 by Z_CLU

NTR త్రివిక్రమ్ మూవీ ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మ్యాగ్జిమం ఫిబ్రవరి కల్లా సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాలో NTR సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నట్టు తెలుస్తుంది. ఈ లెక్కన త్రివిక్రమ్ గత కొన్ని సినిమాలుగా 2 హీరోయిన్స్ కంపల్సరీ అనే రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది.

 

 

‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సమంతాతో పాటు ప్రణీత సుభాష్ హీరోయిన్ గా నటించింది. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, మ్యాగ్జిమం అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది. ఈ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ తరవాత త్రివిక్రమ్, తన ప్రతి సినిమాలో 2 హీరోయిన్స్ ఫార్మూలాను మిస్ కాకుండా ఫాలో అయిపోతున్నాడు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘S/o సత్యమూర్తి’ సినిమాలోను సమంతాతో పాటు నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. ఇద్దరు హీరోయిన్స్ ని డిఫెరెంట్ షేడ్స్ లలో ప్రెజెంట్ చేసిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

S/o సత్యమూర్తి తరవాత రిలీజైన అ…ఆ… సినిమాలోను నితిన్ సరసన సమంతాతో పాటు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరి క్యారెక్టర్స్ కి ఏ మాత్రం పొంతన లేకుండా దేనికదే స్పెషల్ అనిపించుకుంది.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలోను అనూ ఇమ్మాన్యువెల్ తో పాటు, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా హై ఎండ్ ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

 

ఇలా స్టార్స్, స్టోరీస్ మారుతున్నా 2 హీరోయిన్స్ ఫార్మూలాను మాత్రం పర్మనెంట్ సిగ్నేచర్ గా మార్చుకున్న త్రివిక్రమ్, NTR సినిమా స్క్రిప్ట్ లో కూడా ఇద్దరు హీరోయిన్స్ కి స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇందులో ఒక హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యువెల్ ని కన్సిడర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇంకో హీరోయిన్ గా ఏ హీరోయిన్ చాన్స్ కొడుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.