Zee Telugu పదహారేళ్ళ వేడుక

Friday,May 14,2021 - 03:45 by Z_CLU

జీ తెలుగు ఛానెల్ ప్రారంభమై పదహారేళ్ళవుతుంది. 2005 లో మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ చక్కని వినోదభరితమైన ప్రోగ్రామ్స్ , సినిమాలతో అందరికీ చేరువై మంచి ఆదరణతో ముందుకు సాగుతుంది. ఈ ఏడాదితో పదహారేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జీ మహోత్సవం పేరిట ఇటివలే ఓ వేడుక జరిపారు . ఈ షో మే 16న ఈ ఆదివారం 6గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. పదహారేళ్ళ పండుగ జరుపుకున్తున్నీ సమయంలో జీ తెలుగు ఛానెల్ ఆలిండియాలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతూ ముందుండటం విశేషం.

జీ కుటుంబంతో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శ్రీముఖి యాంకరింగ్ వక్తగా వ్యవహరించింది. వేడుకలో నటుడు ఆలి పెర్ఫామెన్స్ , మధు ప్రియ సింగింగ్, పాటు హీరోయిన్ పూర్ణ డాన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలవనుంది. 16 నిమిషాల పాటు పదహారు పాటలతో ఉండే మ్యూజికల్ పెర్ఫార్మెన్స్ ఈ షోలో మరో స్పెషల్ ఎట్రాక్షన్. మరికొందరు టివీ ఆర్టిస్టులు ఈ వేడుకలో పాల్గొని తమ స్టైల్ లో ఎంటర్టైన్ చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ భయపెడుతున్నా ప్రజలకి ఛానెల్ ద్వారా వినోదం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ ప్రోగ్రాం ని ఇటివలే షూట్ చేశారు. ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించి మరింత వినోదం పొందండి.