గెస్ట్ రోల్స్ కి సై అంటున్న కుర్ర హీరోలు..

Thursday,August 18,2016 - 03:00 by Z_CLU

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ప్రస్తుతం ‘మజ్ను’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఉయ్యాల-జంపాల’ చిత్రం తో దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్ అందుకున్న విరించి వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు యూనిట్. సెప్టెంబర్ 17 న విడుదల కానున్న ఈ సినిమాలో నాని తో కలిసి ఓ గెస్ట్ లో కనిపించబోతున్నాడట యంగ్ హీరో రాజ్ తరుణ్. ఈ సినిమాలో ఒక సందర్భం లో వచ్చే కీలక సన్నివేశం లో గెస్ట్ రోల్ పాత్ర లో కనిపించనున్నాడట రాజ్ తరుణ్. ఇక ఈ పాత్ర గురించి చెప్పగానే నాని , విరించి వర్మ ల స్నేహం కోసం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ఈ కుర్ర హీరో. ఇక నాగ చైతన్య కూడా ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ సందీప్ కిషన్ సినిమాలో ఇలాంటి గెస్ట్ రోల్ లోనే కనిపించనున్నాడు. మరి ఈ మధ్య టాలీవుడ్ కుర్ర హీరో లు తమ స్నేహం కోసం ఇలాంటి గెస్ట్ రోల్స్ కి ఓకే చెప్పేస్తూ తమ స్నేహ బంధం చాటుకుంటున్నారు.