రవితేజకు వెంకీ వాయిస్ ఓవర్
Friday,January 01,2021 - 11:03 by Z_CLU
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’ షూటింగ్ మొత్తం పాటలతో సహా పూర్తయి, సంక్రాంతి కానుకగా విడుదలకు రెడీ అవుతోంది.
ఎగ్జయిటింగ్ అనిపించే లేటెస్ట్ అప్డేట్ ఏమంటే, ‘క్రాక్’ మూవీకి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆయన వాయిస్ ఓవర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పోస్టర్ల దగ్గర్నుంచి సాంగ్స్ వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ విషయాలన్నీ అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ప్రత్యేకించి, ఎస్. తమన్ సంగీతం సమకూర్చిన పాటలైతే సంగీత ప్రియులను అమితంగా అలరించాయి.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాతో రవితేజ, గోపీచంద్ మలినేని ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేశారు. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారు.