షూటింగ్ పూర్తి చేసుకున్న మల్టీ స్టారర్ సినిమా
Saturday,June 16,2018 - 04:20 by Z_CLU
నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమా ‘వీర భోగ వసంత రాయలు’ షూటింగ్ పూర్తి చేసుకుంది. బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్న ఈ సినిమాతో ఇంద్రసేన.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
హైద్రాబాద్ తో సహా న్యూఢిల్లీ, ఆగ్రా, ముంబై, చెన్నై, పరిసర ప్రాంతాల్లో, జరిగిన షెడ్యూల్ లో సినిమా పూర్తయ్యింది. ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ నెలలోనే టైటిల్ లోగో ఆవిష్కరించి జులై మొదటివారంలో టీజర్ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.