పారిస్ లో పనిపూర్తిచేసిన తేజూ

Monday,May 07,2018 - 05:29 by Z_CLU

ప్రస్తుతం తేజ్-ఐ లవ్ యు అనే సినిమా చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి పారిస్ లో మరో షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ షెడ్యూల్ లో తేజు-అనుపమపై ఓ సాంగ్ తో పాటు కొన్ని సన్నివేశాలు పిక్చరైజ్ చేశారు.

రొమాంటిక్ సినిమాల స్పెషలిస్ట్ కరుణాకరన్ చాలా టైం తీసుకొని రాసుకున్న స్క్రిప్ట్ ఇది. మూవీకి సంబంధించి రీసెంట్ గా ఫస్ట్ లుక్ టీజర్, టైటిల్ లోగో కూడా రిలీజ్ చేశారు. ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ రిలీజ్ అయిన వెంటనే పారిస్ వెళ్లిన యూనిట్.. ఇప్పుడా షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసింది.

పారిస్ లో తీసిన సీన్స్, సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయంటున్నాడు తేజు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీత దర్శకుడు.