ప్రతిరోజూ పండగే అంటున్న సాయితేజ్

Monday,June 24,2019 - 12:46 by Z_CLU

చిత్రలహరి సక్సెస్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయితేజ్, మరో సినిమా స్టార్ట్ చేశాడు. మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈ సినిమాకు ప్రతి రోజూ పండగే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాశి ఖన్నా హీరోయిన్. సుప్రీమ్ తర్వాత సాయితేజ్, రాశి ఖన్నా కాంబోలో వస్తున్న సినిమా ఇదే.

యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్-2 బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాకు దిల్ రాజు క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ ప్రజెంటర్ కూడా.

బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. జయకుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయబోతున్నాడు. త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.