అక్టోబర్ 7న 'ధ్రువ' విడుదల

Wednesday,August 24,2016 - 04:36 by Z_CLU

 

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, రకుల్ ప్రీత్ సింగ్ జంట‌గా, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ‘ ధృవ’. ప్రస్తుతం చిత్రీకరణ లో ఉన్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 5 నాటికి టోట‌ల్ టాకీ కంప్లీట్ చేసుకోనుంది. ఇక చిత్ర పాటలకు సంబంధించిన చిత్రీకరణ ను కూడా అదే నెలలో పూర్తి చేసి అక్టోబర్ 7 న విజయ దశమి కానుకగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్.. పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌తో పాటు అర‌వింద్ స్వామి ఫెర్‌ఫార్మెన్స్ కూడా హైలెట్ గా నిలవనుందని అంటున్నారు యూనిట్..