#PSPK29 ఎవరితో అంటే?

Tuesday,February 04,2020 - 11:02 by Z_CLU

రెండేళ్ళ గ్యాప్ తర్వాత ఎవరూ ఊహించని విధంగా మూడు సినిమాలు అనౌన్స్ చేసి సెట్స్ పై పెట్టేసాడు పవర్ స్టార్. ఇటివలే ‘పింక్’ రీమేక్ అలాగే క్రిష్ సినిమాను సైలెంట్ గా సెట్స్ పై పెట్టిన పవన్ తాజాగా హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాను అఫీషియల్ గా ప్రకటించాడు. అయితే ప్రస్తుతం పవన్ లిస్టు చూసి ఇండస్ట్రీలో అందరూ షాక్ అవుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ ఇక సినిమాను పక్కన పెడతాడనుకున్న అందరికీ మూడు సినిమాలతో అవక్కయ్యేలా చేసాడు.

ఇదే స్పీడ్ లో పవన్ త్వరలోనే మరో సినిమా కూడా కన్ఫర్మ్ చేసుకునే పనిలో ఉన్నాడట. ఇటివలే పూరి  పవన్ ను కలిసి ఓ పొలిటికల్ డ్రామా కథను వినిపించాడని కథ నచ్చడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇప్పటికే పవన్ తో రెండు సినిమాలు చేసాడు పూరి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి డైరెక్ట్ చేయాలని చూస్తున్నాడు. దిల్ రాజు, ఏ.ఎం.రత్నం , మైత్రి ల మాదిరి గానే పవన్ మరో ఇద్దరు నిర్మాతలకు మాటిచ్చాడట. వారిలో ఒకరు ఈ కాంబో సినిమాను నిర్మించే అవకాశం ఉంది. మరి ఇదే నిజమైతే ఏడాదికి రెండు చెప్పున రెండేళ్ళ పాటు పవన్ డైరీ ఫుల్ అయినట్టే.