సెట్స్ పైకొచ్చిన పవన్-క్రిష్ సినిమా

Tuesday,February 04,2020 - 03:39 by Z_CLU

రీఎంట్రీ తర్వాత పవన్ కల్యాణ్ ఎనౌన్స్ చేసిన రెండో సినిమా ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తొలి రోజు షూట్ లో పవన్ కూడా ఉన్నాడు. ఈ షెడ్యూల్ కు ప్రస్తుతానికి  15 రోజుల కాల్షీట్లు ఇచ్చాడు.

 రీసెంట్ గానే ఈ సినిమా లాంఛ్ అయింది. వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

 కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాను ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. పింక్ రీమేక్ రిలీజైన షార్ట్ గ్యాప్ లోనే ఈ సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది.