'పింక్' రీమేక్ కొత్త వర్షన్ తో !

Tuesday,February 04,2020 - 05:00 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత ‘పింక్’ రీమేక్ తో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ రీమేక్ ను తెలుగులో కొన్ని మార్పులతో తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే హిందీ , తమిళ్ లో వచ్చిన వర్షన్స్ తో పోలిస్తే ఇది  కొత్తగా ఉంటుందని అంటున్నాడు నిర్మాత దిల్ రాజు. హిందీ, తమిళ్ లో సినిమా చూసిన వారికి తెలుగు రీమేక్ కొత్తగా అనిపించడం ఖాయం అని తెలిపాడు.

ఇప్పటికే సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్న మేకర్స్ మే 15 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉగాదికి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు.

నివేతా థామస్ , అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను బోణీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ రీమేక్ ను హ్యాండిల్ చేస్తున్నాడు.  తమన్ మ్యూజిక్ కంపోజర్.