కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో ...

Saturday,May 11,2019 - 04:24 by Z_CLU

నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా తెరకెక్కనున్న ‘మ‌ను చ‌రిత్ర‌’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఫాలింగ్ ఇన్ ల‌వ్ ఈజ్ ఏ పెయిన్‌ఫుల్ జాయ్‌’  అనే ట్యాగ్ లైన్ తో ఎమోష‌న‌ల్ ఇన్ టెన్స్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాతో భ‌ర‌త్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాజల్ అగర్వాల్ సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శివ సరసన మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తుంది.

కాజల్ మేనేజర్ రాన్స‌న్ జోసెఫ్‌ ఈ చిత్రంతో నిర్మాత‌గా మారుతున్నాడు. ఆయ‌న‌తో క‌లిసి ఎన్‌.శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు  గోపీసుంద‌ర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.