లేట్ అయినా లేటెస్ట్ గా...
Monday,October 10,2016 - 04:44 by Z_CLU
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇజం’. ఇటీవలే ఆడియో ఆవిష్కరణ జరుపుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి దసరా బరిలోనే ఈ సినిమాను రంగంలోకి దించాలని అనుకున్నప్పటికీ.. లేటైనా లేటెస్ట్ గా సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ను తనదైన స్టైల్ లో పూరి ప్రెజెంట్ చేశాడు. ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ కూడా కళ్యాణ్ రామ్ ను సరికొత్తగా చూపించినందుకు పూరి జగన్ ని అభినందించాడు. ఇప్పటికే టీజర్, పాటలతో హల్ చల్ చేస్తున్న ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరో సూపర్ హిట్ అందుకుంటాడనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. అదితి ఆర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో జగపతిబాబు కనిపిస్తాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.