నో మూవీస్.. ఓన్లీ పాలిటిక్స్
Wednesday,March 21,2018 - 05:32 by Z_CLU
ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇక సినిమాల్లేవని క్లారిటీ ఇచ్చేశాడు. కనీసం 2019 ఎన్నికలు పూర్తయ్యే వరకైనా సినిమాలు చేయనని చెప్పేశాడు. పవన్ లేటెస్ట్ ప్రకటనతో.. అతడు మరో సినిమా చేస్తాడనే ఊహాగానాలకు చెక్ పడింది.
‘అజ్ఞాతవాసి’ తర్వాత పూర్తిగా పాలిటిక్స్ కే ఫిక్స్ అయ్యాడు పవన్. ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు పవన్ కొత్త సినిమా ఎనౌన్స్ చేస్తాడేమోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడు పవన్. ఇక రెండోది ఏఎం రత్నం సమర్పణలో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. సో.. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి సెట్స్ పైకి వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే పవన్ మాత్రం ఎన్నికల తర్వాత పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటానని ఎనౌన్స్ చేశాడు.
పవన్ స్టేట్ మెంట్ తో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్.. సేమ్ టైం కాస్త ఆనందపడ్డారు కూడా. ఎందుకంటే.. 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు అనుకూలిస్తే మరో సెన్సేషనల్ కాంబినేషన్ తో పవన్ సెట్స్ పైకి రావడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.